ఒమన్ లో 'నీట్' కేంద్రం ఎత్తివేత.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు
- February 20, 2024
మస్కట్: ఒమన్,ఇతర జిసిసి దేశాలలో నీట్ పరీక్షా కేంద్రాన్ని తొలగించడంపై కైరాలీ ఒమన్ సంఘం నేతృత్వంలోని భారతీయ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్కు మెమోరాండం సమర్పించారు. ఒమన్లోని భారతీయ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల నిరంతర అభ్యర్థనల నేపథ్యంలో ఇండియన్ స్కూల్ మస్కట్లో NEET కేంద్రాన్ని 2022లో ప్రారంభించింది. గత సంవత్సరాల్లో చాలా మంది తల్లిదండ్రుల నుండి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా, కైరాలీ ఒమన్ సంఘం భారతదేశంలోని పార్లమెంటు సభ్యులకు మెమోరాండంలు ఇచ్చింది. ఇటువంటి సమిష్టి కృషి ఫలితంగా మస్కట్లోని ఇండియన్ స్కూల్లో నీట్ కేంద్రం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసుల కమ్యూనిటీ గ్రూపుల మద్దతుతో తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా ప్రారంభమైన ఈ కేంద్రం ఎటువంటి కారణం లేకుండా ఎత్తివేయడంతో ఒమన్లోని తల్లిదండ్రులు నిరాశ పడుతున్నారు. మరోవైపు నీట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒమన్తో సహా గల్ఫ్ దేశాలలో పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా రద్దు చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ముప్పు తెచ్చే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, నీట్ పరీక్షా కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కైరాలీ ఒమన్ కమ్యూనిటీతో పాటు తల్లిదండ్రుల బృందం ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ను కోరారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







