రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఈ సారైనా ఫలిస్తుందా.?
- February 20, 2024
వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలూ బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ గ్యాప్లో రిలీజ్ చేస్తుండడమే. ఈ వారం ఆయన తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్కి సిద్ధమైంది.
ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, జైలు ప్రయాణం, బెయిల్పై బయటికి రావడం.. గట్రా పలు అంశాల్ని చూపించబోతున్నారు. ఈ వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. ఆయన భార్య భారతి పాత్రలో మానస నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అలాగే మరో సినిమా ‘శపథం’ కూడా వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదేంటో.! ఆయన ఎప్పుడు సినిమాలు తెరకెక్కించేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో.! అసలు కొన్ని సినిమాలైతే రిలీజ్కే నోచుకోవు.
కానీ, ఈ సారి మాత్రం రెండు సినిమాల్నీ వారం రోజుల గ్యాప్లో రిలీజ్ చేసేస్తున్నాడు. సినిమాల్లో విషయం పక్కన పెడితే.. రిలీజ్కి ముందు ఆయన చేసే పబ్లిసిటీ స్టంట్లే సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తాయంతే.! అలాంటివే ఇప్పుడు రాబోయే రెండు సినిమాలూ కూడా. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్ని ఆడిపోసుకోవడమే ఆయన సినిమాల్లోని వుద్దేశ్యం.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







