తెలుగు హీరోలపై మోజు పెంచుకుంటోన్న తమిళ స్టార్ హీరో.!
- February 21, 2024ప్యాన్ ఇండియా వచ్చాకా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేవ్. ఇండియన్ సినిమాగానే సినిమా చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వివిధ భాషల్లోని నటీ నటులు ఈజీగా మింగిల్ అయిపోతున్నారు.
వివిధ భాషల నటీ నటులు స్నేహ పూర్వకంగా కలిసి మెలిసి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు హీరోలతో ఎక్కువగా కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాడు.
టాలీవుడ్లో ధనుష్కి ఓ ప్రత్యేకమైన స్థానం వుంది ఇప్పటికే. ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు.
తెలుగు హీరోలూ, తెలుగు దర్శకులతో కలిసి పని చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఆల్రెడీ ‘సార్’ సినిమా చేశాడు. యంగ్ హీరో సందీప్ కిషన్తో ‘కెప్టెన్ మిల్లర్’ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
అలాగే, ఇప్పుడు మరోసారి సందీప్ కిషన్తోనే కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరాం కూడా నటిస్తున్నాడు ధనుష్తో కలిసి. ఇది ధనుష్కి 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ విశేషమైన రెస్సాన్స్ అందుకుంటోంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే కుర్రాళ్లలా ఈ ముగ్గురూ నటిస్తున్నారు ఈ సినిమాలో. అయితే, ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఈ సినిమాతో చూపించబోతున్నారని తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో ధనుష్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు