ఇండియాతో ఎంఓయు, డ్రాఫ్ట్‌ అగ్రిమెంట్లకు క్యాబినెట్‌ ఆమోదం

- June 02, 2016 , by Maagulf
ఇండియాతో ఎంఓయు, డ్రాఫ్ట్‌ అగ్రిమెంట్లకు క్యాబినెట్‌ ఆమోదం


 
ఖతార్‌ మరియు భారతదేశాల మధ్య పలు ఒప్పందాలు, అగ్రిమెంట్లకు సంబంధించి క్యాబినెట్‌ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, ఖతార్‌లో పర్యటించిన దరిమిలా ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థనితో జరిగిన చర్చల ఫలితంగా కుదిరిన ఒప్పందాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కస్టమ్స్‌ సంబంధిత విషయాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇందులో కీలకమైనది. అలాగే, హెల్త్‌ మరియు టూరిజం రంగాల్లో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం మరో కీలక అంశం. మనీ లాండరింగ్‌, తీవ్రవాదానికి ఆర్థిక సహాయం, దానికి సంబంధించిన నేరాలు తదితర అంశాలపైనా ఇరు దేశాల మధ్యా అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మరియు క్రీడలకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఈ సందర్భంగా జరిగాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం మరియు కస్టమ్స్‌ విభాగాలకు సంబంధించి భారత క్యాబినెట్‌ కూడా నిన్ననే పలు ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయడం జరిగింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com