ఇండియాతో ఎంఓయు, డ్రాఫ్ట్ అగ్రిమెంట్లకు క్యాబినెట్ ఆమోదం
- June 02, 2016
ఖతార్ మరియు భారతదేశాల మధ్య పలు ఒప్పందాలు, అగ్రిమెంట్లకు సంబంధించి క్యాబినెట్ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, ఖతార్లో పర్యటించిన దరిమిలా ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో జరిగిన చర్చల ఫలితంగా కుదిరిన ఒప్పందాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కస్టమ్స్ సంబంధిత విషయాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇందులో కీలకమైనది. అలాగే, హెల్త్ మరియు టూరిజం రంగాల్లో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం మరో కీలక అంశం. మనీ లాండరింగ్, తీవ్రవాదానికి ఆర్థిక సహాయం, దానికి సంబంధించిన నేరాలు తదితర అంశాలపైనా ఇరు దేశాల మధ్యా అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మరియు క్రీడలకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఈ సందర్భంగా జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్, టూరిజం మరియు కస్టమ్స్ విభాగాలకు సంబంధించి భారత క్యాబినెట్ కూడా నిన్ననే పలు ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయడం జరిగింది
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







