దుబాయ్‌లో చిందులేస్తున్న 'జక్కన్న'

- June 02, 2016 , by Maagulf
దుబాయ్‌లో చిందులేస్తున్న 'జక్కన్న'

సునీల్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'జక్కన్న'. జానీ మాస్టర్‌ నేతృత్వంలో ఓ పాటను ఇటీవల దుబాయ్‌లో తెరకెక్కించారు. మరో పాటను విశాఖలో చిత్రీకరించడంతో మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ నెల రెండో వారంలో చిత్రం ఆడియోను, వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌పీఏ క్రియేషన్స్‌ పతాకంపై సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌కి జోడీగా మన్నార్‌ చోప్రా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com