కోర్టు ఆదేశాల ఉల్లంఘ‌న‌..వ్యక్తికి 20,000 దిర్హామ్‌ల జరిమానా

- February 23, 2024 , by Maagulf
కోర్టు ఆదేశాల ఉల్లంఘ‌న‌..వ్యక్తికి 20,000 దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: సోషల్ మీడియా 'ఖాతా ధృవీకరణ' కుంభకోణంలో వ్యక్తికి 20,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు. మరొక సోషల్ మీడియా వినియోగదారు ఖాతాని 'వెరిఫై' చేయడానికి Dh61,750 అడిగిన వ్యక్తికి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్ర‌కారం..  నిందితుడిపై బాధితుడు దావా వేసాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, నైతిక మరియు భౌతిక నష్టపరిహారం కోసం Dh10,000 కోరారు. అబుదాబి సివిల్ ఫ్యామిలీ కోర్టు వారు మొత్తం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిందితులను ఆదేశించి, 5,000 దిర్హామ్ జరిమానా విధించారు. ప్రతివాది సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించ‌లేదు. దీంతో అతడిపై క్రిమినల్‌ కేసు పెట్టారు. క్రిమినల్ కోర్ట్ ప్రతివాది 20,000 దిర్హామ్‌లను జరిమానాగా చెల్లించాలని మరియు 61,750 దిర్హామ్‌లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com