అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు
- February 26, 2024
యూఏఈ: అజ్మాన్లోని ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరందరూ పాకిస్తాన్ జాతీయులు సింధ్, పంజాబ్ ప్రావిన్సులకు చెందినవారని అధికారులు తెలిపారు. "ఫిబ్రవరి 24న అజ్మాన్లోని శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లు మరియు సంబంధిత రసాయన ఉత్పత్తుల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు. వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించారు" అని పోలీసులు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్ఫేర్ వింగ్ బృందం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కార్మికుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తుంది. యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ క్షతగాత్రులు కోలుకోవాలని, ప్రమాదంలో బాధితులైన పాకిస్థానీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







