అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు
- February 26, 2024
యూఏఈ: అజ్మాన్లోని ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరందరూ పాకిస్తాన్ జాతీయులు సింధ్, పంజాబ్ ప్రావిన్సులకు చెందినవారని అధికారులు తెలిపారు. "ఫిబ్రవరి 24న అజ్మాన్లోని శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లు మరియు సంబంధిత రసాయన ఉత్పత్తుల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు. వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించారు" అని పోలీసులు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్ఫేర్ వింగ్ బృందం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కార్మికుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తుంది. యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ క్షతగాత్రులు కోలుకోవాలని, ప్రమాదంలో బాధితులైన పాకిస్థానీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం







