అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు
- February 26, 2024
యూఏఈ: అజ్మాన్లోని ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరందరూ పాకిస్తాన్ జాతీయులు సింధ్, పంజాబ్ ప్రావిన్సులకు చెందినవారని అధికారులు తెలిపారు. "ఫిబ్రవరి 24న అజ్మాన్లోని శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లు మరియు సంబంధిత రసాయన ఉత్పత్తుల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు. వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించారు" అని పోలీసులు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్ఫేర్ వింగ్ బృందం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కార్మికుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తుంది. యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ క్షతగాత్రులు కోలుకోవాలని, ప్రమాదంలో బాధితులైన పాకిస్థానీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







