అజ్మాన్ లో అగ్నిప్రమాదం..9 మందికి గాయాలు
- February 26, 2024
యూఏఈ: అజ్మాన్లోని ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరందరూ పాకిస్తాన్ జాతీయులు సింధ్, పంజాబ్ ప్రావిన్సులకు చెందినవారని అధికారులు తెలిపారు. "ఫిబ్రవరి 24న అజ్మాన్లోని శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లు మరియు సంబంధిత రసాయన ఉత్పత్తుల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు. వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించారు" అని పోలీసులు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్ఫేర్ వింగ్ బృందం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కార్మికుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తుంది. యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ క్షతగాత్రులు కోలుకోవాలని, ప్రమాదంలో బాధితులైన పాకిస్థానీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









