ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య తీవ్రమైన దాడులు
- February 27, 2024
బీరుట్: ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ ప్రయోగించిన డ్రోన్ను లెబనాన్ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది.
దక్షిణ లెబనాన్లోని ఇక్లిమ్ అల్ -తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయిల్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్ అధికారులు తిరస్కరించారు.డ్రోన్ను కూల్చివేయడం అంటే అది 'అద్భుత చర్య' అవుతుందని అన్నారు. ప్రతిచర్యగా ఇజ్రాయిల్ బీకా వ్యాలీ, మజదీల్ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్ హుస్సేన్ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్ ఆరోపణలతో లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను వేగవంతం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







