శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్..!
- March 01, 2024
హైదరాబాద్: బెంగళూరులో బాంబు పేలుడు ఘటనతో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలుచోట్ల పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఎయిర్పోర్ట్ విలేజ్లో తనిఖీలు జరిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతి ప్రయాణికుని సెక్యూరిటీ ఆధికారులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ప్రయాణికుడి లగేజీ బ్యాంగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి అనుమతిస్తున్నారు.
అదేవిధంగా, హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అలాగే, రద్దీ ప్రాంతాలతో పాటు షాపింగ్ మాల్స్లలో ముమ్మర తనిఖీలు చేశారు. కొన్నిచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పద వాహనాలను సైతం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
బెంగళూరులో పేలుడు.. 9మందికి తీవ్రగాయాలు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు చేస్తోంది. ఒక బ్యాగులో తీసుకొచ్చిన పదార్థాలే పేలుడికి దారితీసినట్టు సమాచారం.
గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీతో గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఒక బ్యాగ్ను హోటల్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!









