ఇండియన్ ఎంబసీ అవెన్యూస్లో ఇండియా టూరిజం రోడ్షో
- March 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కువైట్లోని అవెన్యూస్ మాల్లో రెండు రోజుల ఇండియా టూరిజం ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ ఈవెంట్ సమ్మర్ టూరిజం, లగ్జరీ ట్రైన్స్ ఆఫ్ ఇండియా, వెల్నెస్ & రిజువెనేషన్, గోల్డెన్ ట్రయాంగిల్ అడ్వెంచర్ & వైల్డ్ లైఫ్ మరియు మరిన్ని వంటి విభిన్న థీమ్లతో వివిధ భారతీయ పర్యాటక గమ్యస్థానాల గురించి తెలియజేసారు. సీజర్స్ ట్రావెల్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్, ITL వరల్డ్ మరియు అరోరా హాలిడేస్తో పాటు ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫీసుతో సహా కువైట్ నుండి ప్రసిద్ధ టూర్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలగురించి తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కువైటీలు ఇప్పుడు భారతదేశాన్ని సందర్శించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని లగ్జరీ ట్రావెల్స్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ మిస్టర్ బాబీ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా కువైట్లోని వివిధ భారతీయ నృత్య బృందాలు ప్రదర్శించిన భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహినియాట్టం మొదలైన వివిధ భారతీయ కళలు మరియు నృత్య రూపాలు ఆకట్టకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







