ఇండియన్ ఎంబసీ అవెన్యూస్లో ఇండియా టూరిజం రోడ్షో
- March 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కువైట్లోని అవెన్యూస్ మాల్లో రెండు రోజుల ఇండియా టూరిజం ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ ఈవెంట్ సమ్మర్ టూరిజం, లగ్జరీ ట్రైన్స్ ఆఫ్ ఇండియా, వెల్నెస్ & రిజువెనేషన్, గోల్డెన్ ట్రయాంగిల్ అడ్వెంచర్ & వైల్డ్ లైఫ్ మరియు మరిన్ని వంటి విభిన్న థీమ్లతో వివిధ భారతీయ పర్యాటక గమ్యస్థానాల గురించి తెలియజేసారు. సీజర్స్ ట్రావెల్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్, ITL వరల్డ్ మరియు అరోరా హాలిడేస్తో పాటు ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫీసుతో సహా కువైట్ నుండి ప్రసిద్ధ టూర్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలగురించి తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కువైటీలు ఇప్పుడు భారతదేశాన్ని సందర్శించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని లగ్జరీ ట్రావెల్స్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ మిస్టర్ బాబీ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా కువైట్లోని వివిధ భారతీయ నృత్య బృందాలు ప్రదర్శించిన భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహినియాట్టం మొదలైన వివిధ భారతీయ కళలు మరియు నృత్య రూపాలు ఆకట్టకున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









