మలేషియా క్షమాభిక్ష పథకం
- March 03, 2024
కౌలాలంపూర్: మలేషియా క్షమాభిక్ష పథకం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) అక్రమ వలసదారులు స్వదేశానికి వెళ్లే అవకాశం-మలేషియా తెలంగాణ అసోసియేషన్.
ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది.
ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళవచ్చు.
ఈ ఆమ్నెస్టీ ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో దాదాపు రూ 10000) చెలించాల్సివుంది . అలాగే పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా రెండు వారాల్లో ఇండియా వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
మలేషియా లో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాదు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు సంబంధించిన కార్మికులు సరైన అవగాహన లేకుండా ఏజెంట్ల చేతులలో మోసపోయి మలేషియా జైల్లో మగ్గుతున్న కార్మికుల ఎందరో వున్నారు.
ఈ క్షమాభిక్ష పథకం చాలా మందికి తెలియకపోవటం దురదృష్టకరం. ఇలాంటి మంచి అవకాశాన్ని మలేసియాలో బాధపడుతున్న కార్మికులు వినియోగించుకొని వారు వారి స్వగ్రామాలకు తిరిగి రావాలని, ఈ మలేషియా క్షమాభిక్ష పథకం యెక్క సమాచారాన్ని మీడియా ద్వారా అందరికి విస్తృత ప్రచారం చేయవలసింది ఆశిస్తున్నాము అలాగే ఈ పథకాన్ని ఉపయోగించుకొని వచ్చే వారికి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలు వారికీ ఫ్లైట్ చార్జీలు మరియు అపరాధ రుసుము ప్రభుత్వం భరించేలా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.
ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలిసినవారు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు