మెగాస్టార్తో వశిష్ట ఇప్పుడప్పుడే వదిలేది లేదంటున్నాడు.!
- March 07, 2024
ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ పార్టులు పార్టులుగా రిలీజ్ చేసేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఒకే సినిమాగా రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు సైతం చివరికి వచ్చేసరికి రెండు, వీలైతే మూడు పార్టులు అని అనౌన్స్ చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకీ ఇదే టాక్ వినిపిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మూడు కాలాల నేపథ్యంలో కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కథా, కథనాలకు లాంగ్ లెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ యాంగిల్లోనే ‘విశ్వంభర’ విషయంలో ఈ సరికొత్త ప్రచారం తెర పైకి వచ్చింది.
అయితే, అటు డైరెక్టర్ వశిష్ట కానీ, ఇటు మెగాస్టార్ చిరంజీవి కానీ ఈ ప్రచారంపై ఇంతవరకూ స్పందించలేదు. ఒకవేళ అదే జరిగితే, మెగా ఫ్యాన్స్కి పండగే. అలాగే, వశిష్ట కూడా ఇప్పుడప్పుడే మెగాస్టార్ చిరంజీవిని వదిలి పట్టే అవకాశమే వుండదు. అసలింతకీ ఇందులో నిజమెంతో తెలీయాల్సి వుంది.
త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైద్రాబాద్లో ఏర్పాటు చేసిన సెట్లో ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







