రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు.!
- March 07, 2024సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు.. హీరో కానీ, హీరోయిన్ కానీ రెమ్యునరేషన్ పెంచేస్తారు.. అనే ప్రచారం వుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి విషయంలోనూ తాజాగా అదే ప్రచారం జరుగుతుంది.
సాయి పల్లవి మంచి నటి. మంచి ఫాలోయింగ్ వుంది. అయినా స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న అత్యాశకు పోకుండా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటుంది.
ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సాయి పల్లవికి రెమ్యునరేషన్ గురించిన ప్రశ్న ఎదురైంది.
ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారట కదా మీరు.. అనేదే ఆ ప్రశ్న. అందుకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం.. నేను నటించిన సినిమా సూపర్ హిట్ అయితే మేకర్సే నన్ను పిలిచి మరీ ఎక్కువ అమౌంట్ ఇస్తారు.. అలాంటప్పుడు నేనెందుకు డిమాండ్ చేయడం అని సమాధానమిచ్చింది.
అలాగే, ఒకవేళ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే సిట్యువేషనే రావాలంటే.. అది నేను నటించలేని పాత్ర.. అత్యంత కఠినమైన పాత్ర అయ్యుండాలి.. అప్పుడేమైనా డిమాండ్ చేస్తానేమో.. అని నవ్వుతూ సాయి పల్లవి సమాధానమిచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..