ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ ప్రణాళికలను తప్పుబట్టిన సౌదీ అరేబియా
- March 08, 2024
రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో దాదాపు 3,500 కొత్త సెటిల్మెంట్ యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్ ఆక్రమణ అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని, జెరూసలేంతో సహా అందులోని అధిక భాగాన్ని జుడాయిజ్ చేసే ప్రయత్నాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని సాధించే అవకాశాలను నిరోధించడంతో పాటు, ఈ నిర్ణయం అన్ని అంతర్జాతీయ తీర్మానాలు, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్లకు విరుద్ధంగా ఉందని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా పాలస్తీనా ప్రజల కష్టాలను అంతం చేసి వారికి ఆశాజనకంగా ఉండాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించింది. అరబ్ శాంతి చొరవ
అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా పాలస్తీనియన్లు సురక్షితంగా జీవించడానికి వారి హక్కులను పొందేందుకు.. తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న 1967 సరిహద్దులలో వారి పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరాన్ని కూడా మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. వెస్ట్ బ్యాంక్లోని సెటిల్మెంట్లలో 3,400 కంటే ఎక్కువ కొత్త గృహాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా సౌదీ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ ప్రకారం.. దాదాపు 70 శాతం గృహాలు జెరూసలేంకు తూర్పున ఉన్న మాలే అదుమిమ్లో నిర్మించబడతాయి, మిగిలినవి సమీపంలోని కేదార్ మరియు ఎఫ్రాట్లో బెత్లెహెంకు దక్షిణంగా నిర్మించబడతాయి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







