రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

- March 08, 2024 , by Maagulf
రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోడీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com