తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు..విజేత తెలుగు వారియర్స్
- March 11, 2024
ఖతార్: ఖతార్ లో నివసిస్తున్న తెలుగు కార్మికులకు క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతియేటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు మార్చ్ 8న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భగత్ సింగ్ జట్టును తెలుగు వారియర్స్ ఓడించి TGS TPl 9 ట్రోఫీని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయంలో హెడ్ ఆఫ్ లెబర్ వెల్ఫేయిర్ ఇంచార్జ్ జయ గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గెస్ట్ ఆఫ్ హానర్ ICBF అధ్యక్షుడు శనవాస్ బావ మాట్లాడుతూ.. TGS కార్మికుల కోసం నిరంతరం పని చేస్తున్నదని అభినందిచారు. తెలుగు సంఘాల బిష్మ పితా కోడూరి శివప్రసాదరావు మాట్లాడుతూ.. గల్ఫ్ సమితి అన్ని కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ICBF ఉపాధ్యక్షుడు దీపక్ షెట్టి ,ICBF సెక్రెటరీ మహమ్మద్ కుని,ICBF తెలుగు రెపర్సెంటివ్ శంకర్ గౌడ్, Qpl ఫౌండేర్స్ సిరాజ్అన్సారీ, హంజత్, గులరాజ్,అన్వేర్ లు విజేతలకి బహుమతులు అందజేశారు. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు, ఉపాధ్యక్షుడు గడ్డి రాజు,వంశీ,గోలి,సాగర్,ఎల్లన్న,ఎల్లన్న, శ్రీధర్,రాజేష్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి









