కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- April 05, 2026
కువైట్ సిటీ, ఏప్రిల్ 5: కువైట్ సిటీలోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై శనివారం రాత్రి శత్రు డ్రోన్ దాడి జరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ దాడిలో భవనానికి గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
దాడి జరిగిన వెంటనే అత్యవసర సేవా విభాగాలు, భద్రతా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం భవనం పరిసర ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని నష్టం అంచనా పనులు చేపట్టారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా ఆదివారం మంత్రిత్వ శాఖల సముదాయంలోని ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని (Work From Home) చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.అదే విధంగా ఆదివారం ప్రజల సందర్శనను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
అధికారుల ప్రకారం, ప్రస్తుతం భవనానికి జరిగిన నష్టం, మరమ్మతుల అవసరాలు, భద్రతా పరిస్థితులపై సమగ్ర అంచనాలు కొనసాగుతున్నాయి.పరిస్థితిని సమీక్షించిన అనంతరం మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







