ఇంటికో ఇంకుడు గుంత, ..
- June 04, 2016
ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ప్రతి వూరికి ఓ వనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి మొక్కలు నాటాలని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. నవ నిర్మాణ దీక్ష మూడో రోజు కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 6వేల మందితో ఒకేసారి ఆయన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో సంతోషం, సంతృప్తి స్థాయిలు పెంచే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.
రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను ప్రశంశిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న పంచాయతీలకు, స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలకు రూ.5లక్షలు, వంద పంటకుంటలు తవ్విన గ్రామాలకు రూ.4లక్షలు, ఇంటికో ఇంకుడుగుంత సాధించిన గ్రామాలకు రూ.2లక్షలు, 50 వర్మీకంపోస్టు యానిట్లు ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు రూ.2లక్షలు చొప్పున ఇస్తామని సీఎం ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







