రవితేజ ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్కి సై అంటోన్న నిర్మాత.!
- March 12, 2024
మాస్ రాజా రవితేజ, జేజమ్మ అనుష్క జంటగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమార్కుడు’. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో ఓ సంచలనమే ఈ చిత్రం.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. రాధా మోహన్ నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారట నిర్మాత రాధా మోహన్.
ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట ఆయన. అందుకు కథ కూడా సిద్ధంగానే వుందట. కానీ, రాజమౌళి ప్లేస్లో సంపత్ నంది డైరెక్షన్ వహించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
అయితే, ‘విక్రమార్కుడు 2’ని రవితేజతోనే తెరకెక్కించాలన్నది రాధా మోహన్ డ్రీమ్. అలాగే అనుష్క వుంటే బాగుండనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అనుష్క వున్న పరిస్థితుల్లో రవితేజ పక్కన హీరోయిన్గా ఊహించుకోలేం. అలాగే, సంపత్ నంది కూడా తన సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు.
రవితేజను ఒప్పించడం కూడా ఏమంత సులువైన మార్గం కాదు. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు అనేకం వున్నాయ్. ఇలా.. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు అనేక రకాల అడ్డంకులున్నాయ్.
కానీ, రాధా మోహన్ మాత్రం ఈ సినిమా టైటిల్ని రిజిస్టర్ చేయించి ఎప్పటికైనా రవితేజతోనే పట్టాలెక్కించాలన్న పట్టుదలతో వున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









