గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినొచ్చా.?
- March 12, 2024గర్భిణీ స్త్రీలు పైనాపిల్ (అనాస పండు) తింటే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదని గర్భస్రావం అవుతుందనీ నమ్ముతుంటారు. కానీ, శాస్రీయంగా అందుకు ఆధారాల్లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ (అనాస పండులో) ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సి విటమిన్ అత్యంత అవసరం. పుట్టబోయే బిడ్డకు రోగ నిరోధక శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, ఫోలేట్ అను పోషకం పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్లో. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, మెదడు వృద్ధి చెందడంలో ఈ పోషకం కీలక పాత్ర వహిస్తుంది.
అందుకే ఖచ్చితంగా గర్భ ధారణ సమయంలో పైనాపిల్ తినమని నిపుణులు చెబుతుంటారు. కానీ, పెద్దలు మాత్రం గర్భిణీ స్త్రీలకు పైనాపిల్ నిషిద్ధ పండుగా భావిస్తుంటారు.
మందుల రూపంలో తీసుకునే విటమిన్లు, పోషకాలు.. పైనాపిల్ పండు ద్వారా నేచురల్గా బిడ్డకూ, తల్లికీ అందించడానికి పైనాపిల్ ఎంతో తోడ్పడుతుంది.
అందుకే ఎలాంటి అనుమానాలూ లేకుండా గర్భిణీ స్ర్తీలు పైనాపిల్ పండును తినొచ్చని అధ్యయనాలతో పాటూ, వైద్యులు కూడా చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..