గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినొచ్చా.?
- March 12, 2024
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ (అనాస పండు) తింటే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదని గర్భస్రావం అవుతుందనీ నమ్ముతుంటారు. కానీ, శాస్రీయంగా అందుకు ఆధారాల్లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ (అనాస పండులో) ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సి విటమిన్ అత్యంత అవసరం. పుట్టబోయే బిడ్డకు రోగ నిరోధక శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, ఫోలేట్ అను పోషకం పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్లో. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, మెదడు వృద్ధి చెందడంలో ఈ పోషకం కీలక పాత్ర వహిస్తుంది.
అందుకే ఖచ్చితంగా గర్భ ధారణ సమయంలో పైనాపిల్ తినమని నిపుణులు చెబుతుంటారు. కానీ, పెద్దలు మాత్రం గర్భిణీ స్త్రీలకు పైనాపిల్ నిషిద్ధ పండుగా భావిస్తుంటారు.
మందుల రూపంలో తీసుకునే విటమిన్లు, పోషకాలు.. పైనాపిల్ పండు ద్వారా నేచురల్గా బిడ్డకూ, తల్లికీ అందించడానికి పైనాపిల్ ఎంతో తోడ్పడుతుంది.
అందుకే ఎలాంటి అనుమానాలూ లేకుండా గర్భిణీ స్ర్తీలు పైనాపిల్ పండును తినొచ్చని అధ్యయనాలతో పాటూ, వైద్యులు కూడా చెబుతున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









