గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినొచ్చా.?
- March 12, 2024గర్భిణీ స్త్రీలు పైనాపిల్ (అనాస పండు) తింటే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదని గర్భస్రావం అవుతుందనీ నమ్ముతుంటారు. కానీ, శాస్రీయంగా అందుకు ఆధారాల్లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ (అనాస పండులో) ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సి విటమిన్ అత్యంత అవసరం. పుట్టబోయే బిడ్డకు రోగ నిరోధక శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, ఫోలేట్ అను పోషకం పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్లో. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, మెదడు వృద్ధి చెందడంలో ఈ పోషకం కీలక పాత్ర వహిస్తుంది.
అందుకే ఖచ్చితంగా గర్భ ధారణ సమయంలో పైనాపిల్ తినమని నిపుణులు చెబుతుంటారు. కానీ, పెద్దలు మాత్రం గర్భిణీ స్త్రీలకు పైనాపిల్ నిషిద్ధ పండుగా భావిస్తుంటారు.
మందుల రూపంలో తీసుకునే విటమిన్లు, పోషకాలు.. పైనాపిల్ పండు ద్వారా నేచురల్గా బిడ్డకూ, తల్లికీ అందించడానికి పైనాపిల్ ఎంతో తోడ్పడుతుంది.
అందుకే ఎలాంటి అనుమానాలూ లేకుండా గర్భిణీ స్ర్తీలు పైనాపిల్ పండును తినొచ్చని అధ్యయనాలతో పాటూ, వైద్యులు కూడా చెబుతున్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…