టిఫిన్ బాంబుల్ని స్వాధీనం
- June 04, 2016
గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన టిఫిన్ బాంబు పేలడంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటన తమిళనాడులోని మధుర సమీపంలో వైగై నదీ తీరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులెవరో ఒక లారీని లక్ష్యంగా చేసుకుని ఈ పనిచేశారు. కొంత మందుగుండు సామగ్రిని టిఫిన్ బాక్సులో పెట్టి దాన్ని లారీ సమీపంలో పడేశారు. దీంతో అది పేలి స్టేషనరీ వస్తువులతో ఉన్న లారీ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ బాంబు అంత శక్తిమంతమైనదేమీ కాదని పోలీసులు తెలిపారు. అందువల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. గత పదేళ్లలో పోలీసులు మధురై, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఐదు టిఫిన్ బాంబుల్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







