రమదాన్..ఆన్లైన్లో విజృంభిస్తున్న ఛారిటీ స్కామ్లు
- March 15, 2024
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో బహ్రెయిన్లో ఆన్లైన్లో ఛారిటీ స్కామ్లు విజృంభిస్తున్నాయి. దాతృత్వ విరాళాలు చేయడానికి ఎంపికల కోసం వెతుకుతున్న నివాసితులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అవసరమైన వారికి పెద్దమొత్తంలో వాటర్ బాటిళ్లను అందించడానికి విరాళాలు ఇవ్వడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారు. చెల్లింపు పూర్తయిన తర్వాత, బ్యాంక్ లేదా కార్డ్ వివరాలను చోరీ చేసి వారి ఖాతాలు ఖాళీ చేస్తారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలీ బెషరా మాట్లాడుతూ.. వాటర్ బాటిళ్లను అందించడంలో దాతృత్వ విరాళాల పేరుతో రాజ్యంలో ప్రజలను మోసం చేస్తున్నారని, బహ్రెయిన్ పౌరులు లేదా నివాసితులు బాధితులుగా ఉన్న ఇటీవలి సంఘటనల వివరాలను వెల్లడించారు."వారు బాధితులకు ఐదు కార్టన్ల వాటర్ బాటిళ్లను అందించారు. చెల్లింపు కోసం ఒక లింక్ను పంపారు. వారు వారి బ్యాంక్ వివరాలన్నింటినీ దొంగిలించారు. ఒక బాధితుడు BD2,000 కోల్పోయాడు మరియు మరొకరు BD4,000 కోల్పోయారు.’’ అని వివరించారు. ఇదే విధంగా ఎయిర్ ఫ్రైయర్, అధిక-చెల్లింపు, ఉద్యోగాలు, నకిలీ వివాహం, టీకా అప్డేట్ పేరిట స్కామర్లు లింకులు పంపుతూ మోసాలకు పాల్పడతారని తెలిపారు. ACEES సైబర్ నేరాలను నివేదించడానికి హాట్లైన్ని నడుపుతోంది. మీ ఫోన్ నుండి 992కి డయల్ చేయడం ద్వారా లేదా +973 17108108లో వాట్పాప్ లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







