అలరించిన సినారె పాటకు పట్టాభిషేకం
- March 16, 2024
హైదరాబాద్: మూడు వేల పైగా సినీ పాటలు రాసినా సినారె ప్రతి గీతం సాహిత్య పరంగా ప్రత్యేకత ఉన్నవని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి తొలి సినీ గీతం రచించి అరవై ఐదు సంవత్సరాలు అయిన సంధర్భంగా ప్రముఖ గాయకులు మిత్రా వై.ఏస్.రామకృష్ణ శశికళ గీతాంజలి లు నలభై పాటలను మధురంగా అలపించి పాటల పట్టాభిషేకం చేశారు.సినారె రచించిన తొలి పాట నన్ను దోచుకుందవాటే తో అరభించి ఎవరికీ తలవంచకు, చిత్రం భళారే విచిత్రం వంటి పాటలను వారు గానం చేశారు.ఈ సంధర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో నిర్వహకులు వంశీ రామరాజు తిరుమల గ్రూప్ చైర్మన్ నంగ నూరి చంద్ర శేఖర్ పాల్గొని మాట్లాడుతూ సినారె పాటలు నిత్య నూతనం అన్నారు. చంద్ర శేఖర్ గాయనీ గాయకులను అయోధ్య నుంచి తెప్పించిన శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.డాక్టర్ తెన్నేటి సుధ, సుంకరపల్లి శైలజ కార్యక్రమం పర్యవేక్షణ చేయగా సినారె కుమార్తెలు గంగ, యమున,కావేరి,కృష్ణవేణి తమ భర్తలతో పాల్గొన్నారు. ప్రముఖ నటి శారద చెన్నై నుంచి సందేశం పంపుతూ సినారె తన సినిమాలకు సాహిత్య సంగీత పరమైన హిట్ పాటలు రాశారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







