భోజనం తర్వాత సోడా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
- March 16, 2024
హెవీగా భోజనం తిన్నా.. లేదంటే మసాలా ఎక్కువగా వున్న ఆహారం తీసుకున్నా.. పొట్టలో బరువుగా అనిపిస్తుంది. ఆ వెంటనే కాస్త సోడా కానీ, లేదంటే, కూల్ డ్రింక్ కానీ తాగితే పొట్ట తేలిగ్గా అనిపిస్తుంది.
గ్యాస్ బయటికి పోయి, త్రేన్పులు వచ్చి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది. కానీ, ఇది కేవలం తాత్కాలికమైన పీలింగ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. హెవీగా భోజనం చేశాకా సోడా, కూల్ డ్రింక్ వంటివి అస్సలు తీసుకోరాదని చెబుతున్నారు.
అవి తీసుకోవడం వల్ల గ్యాస్ బయటికి రావడం కాదు.. ఇంకా పెరుగుతుంది. అంలాగే ఇతరత్రా జీర్ణ సమస్యలు కూడా జోడవుతాయ్. ఇవి దీర్ఘ కాలం వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ హెవీగా భోజనం తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా బరువుగా అనిపిస్తే మరి ఏం చేయాలి.? కాస్త గోరు వెచ్చని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే కాస్త అల్లం వేసిన వేడి నీటిని తీసుకున్నా ఇంకా మంచి ఫలితం వుంటుంది. సోంప్ కానీ, వాము, జీలకర్ర కానీ తీసుకుంటే ఇంకా మంచిది.
హెవీ ఫుడ్ తీసుకునే టైమ్లో సరిపడా వాటర్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ కంటెంట్తో ఈక్వెల్గా వాటర్ కంటెంట్ కూడా వుండేలా చూసుకుంటే మంచిదని అంటున్నారు. భోజనానికి ముందు ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకుంటే.. భోజనం హెవీగా తీసుకునే అవసరం వుండదు. తద్వారా పొట్ట సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముండదని డైటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







