భోజనం తర్వాత సోడా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
- March 16, 2024హెవీగా భోజనం తిన్నా.. లేదంటే మసాలా ఎక్కువగా వున్న ఆహారం తీసుకున్నా.. పొట్టలో బరువుగా అనిపిస్తుంది. ఆ వెంటనే కాస్త సోడా కానీ, లేదంటే, కూల్ డ్రింక్ కానీ తాగితే పొట్ట తేలిగ్గా అనిపిస్తుంది.
గ్యాస్ బయటికి పోయి, త్రేన్పులు వచ్చి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది. కానీ, ఇది కేవలం తాత్కాలికమైన పీలింగ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. హెవీగా భోజనం చేశాకా సోడా, కూల్ డ్రింక్ వంటివి అస్సలు తీసుకోరాదని చెబుతున్నారు.
అవి తీసుకోవడం వల్ల గ్యాస్ బయటికి రావడం కాదు.. ఇంకా పెరుగుతుంది. అంలాగే ఇతరత్రా జీర్ణ సమస్యలు కూడా జోడవుతాయ్. ఇవి దీర్ఘ కాలం వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ హెవీగా భోజనం తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా బరువుగా అనిపిస్తే మరి ఏం చేయాలి.? కాస్త గోరు వెచ్చని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే కాస్త అల్లం వేసిన వేడి నీటిని తీసుకున్నా ఇంకా మంచి ఫలితం వుంటుంది. సోంప్ కానీ, వాము, జీలకర్ర కానీ తీసుకుంటే ఇంకా మంచిది.
హెవీ ఫుడ్ తీసుకునే టైమ్లో సరిపడా వాటర్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ కంటెంట్తో ఈక్వెల్గా వాటర్ కంటెంట్ కూడా వుండేలా చూసుకుంటే మంచిదని అంటున్నారు. భోజనానికి ముందు ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకుంటే.. భోజనం హెవీగా తీసుకునే అవసరం వుండదు. తద్వారా పొట్ట సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముండదని డైటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!