భోజనం తర్వాత సోడా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
- March 16, 2024
హెవీగా భోజనం తిన్నా.. లేదంటే మసాలా ఎక్కువగా వున్న ఆహారం తీసుకున్నా.. పొట్టలో బరువుగా అనిపిస్తుంది. ఆ వెంటనే కాస్త సోడా కానీ, లేదంటే, కూల్ డ్రింక్ కానీ తాగితే పొట్ట తేలిగ్గా అనిపిస్తుంది.
గ్యాస్ బయటికి పోయి, త్రేన్పులు వచ్చి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది. కానీ, ఇది కేవలం తాత్కాలికమైన పీలింగ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. హెవీగా భోజనం చేశాకా సోడా, కూల్ డ్రింక్ వంటివి అస్సలు తీసుకోరాదని చెబుతున్నారు.
అవి తీసుకోవడం వల్ల గ్యాస్ బయటికి రావడం కాదు.. ఇంకా పెరుగుతుంది. అంలాగే ఇతరత్రా జీర్ణ సమస్యలు కూడా జోడవుతాయ్. ఇవి దీర్ఘ కాలం వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ హెవీగా భోజనం తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా బరువుగా అనిపిస్తే మరి ఏం చేయాలి.? కాస్త గోరు వెచ్చని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే కాస్త అల్లం వేసిన వేడి నీటిని తీసుకున్నా ఇంకా మంచి ఫలితం వుంటుంది. సోంప్ కానీ, వాము, జీలకర్ర కానీ తీసుకుంటే ఇంకా మంచిది.
హెవీ ఫుడ్ తీసుకునే టైమ్లో సరిపడా వాటర్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ కంటెంట్తో ఈక్వెల్గా వాటర్ కంటెంట్ కూడా వుండేలా చూసుకుంటే మంచిదని అంటున్నారు. భోజనానికి ముందు ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకుంటే.. భోజనం హెవీగా తీసుకునే అవసరం వుండదు. తద్వారా పొట్ట సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముండదని డైటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









