రమదాన్ విరాళాల ప్రచారాలలో పిల్లలు.. మంత్రిత్వ శాఖ వార్నింగ్
- March 17, 2024
రియాద్: వాణిజ్య మార్కెటింగ్, ప్రకటనలలో పిల్లలను వాడుకోవడానికి వ్యతిరేకంగా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) హెచ్చరిక జారీ చేసింది. బాలల రక్షణ చట్టంలోని ఆర్టికల్ మూడు, దాని నిబంధనలను అమలు చేయడంలో భాగంగా తాజా ఉత్తర్వులను జారీ చేసినట్లు వెల్లడించింది. ఆందోళన, ఒత్తిడి, బెదిరింపులకు గురికావడం వంటి వాటితో సహా పిల్లలపై ప్రతికూల ప్రభావాలపై చూపడంపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ముఖ్యంగా రమదాన్ విరాళాల ప్రచారాలలో లాభాపేక్షలేని సంస్థలు పిల్లలను ఉపయోగించడాన్ని ఇటీవలి గుర్తించారు. ఇవి చట్టానికి విరుద్ధమైన చర్యలుగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, 19911 నంబర్ను సంప్రదించడం ద్వారా లేదా దాని మొబైల్ యాప్ ద్వారా పిల్లల దోపిడీకి సంబంధించిన ఏవైనా సందర్భాలను నివేదించాలని కమ్యూనిటీని కోరింది.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







