రాశి ఖన్నాను టాలీవుడ్ మర్చిపోయిందా.?
- March 19, 2024
అందాల భామ రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్లో ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా వుంది. ఆమె నటించిన ‘యోధ’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా వుంది. దీంతో పాటూ మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో వున్నాయ్.
అలాగే, తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది రాశిఖన్నా. కానీ, తెలుగులో మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఓకే చేసింది. అదే ‘తెలుసు కదా’. యూత్ఫుల్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశీఖన్నాకి జోడీగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగడం లేదు. ఓ వైపు సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బిజీగా వున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ వుండడంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నాడు.
దాంతో ‘తెలుసు కదా’ షూటింగ్ కాస్త డిలే అవుతోందట. అయితే, తెలుగులో రాశీ ఖన్నాని మర్చిపోక ముందే, ఏదో ఒక సినిమా రాశీ ఖన్నా నుంచి రిలీజ్ కావల్సి వుంది. అది క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా అయితే, కొన్నిరోజులు కాస్త సోదిలో వుంటుంది. అది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









