రాశి ఖన్నాను టాలీవుడ్ మర్చిపోయిందా.?
- March 19, 2024
అందాల భామ రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్లో ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా వుంది. ఆమె నటించిన ‘యోధ’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా వుంది. దీంతో పాటూ మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో వున్నాయ్.
అలాగే, తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది రాశిఖన్నా. కానీ, తెలుగులో మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఓకే చేసింది. అదే ‘తెలుసు కదా’. యూత్ఫుల్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశీఖన్నాకి జోడీగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగడం లేదు. ఓ వైపు సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బిజీగా వున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ వుండడంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నాడు.
దాంతో ‘తెలుసు కదా’ షూటింగ్ కాస్త డిలే అవుతోందట. అయితే, తెలుగులో రాశీ ఖన్నాని మర్చిపోక ముందే, ఏదో ఒక సినిమా రాశీ ఖన్నా నుంచి రిలీజ్ కావల్సి వుంది. అది క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా అయితే, కొన్నిరోజులు కాస్త సోదిలో వుంటుంది. అది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







