స్కెంజెన్ వీసా మినహాయింపు.. చర్చించిన జీసీసీ, ఈయూ
- March 20, 2024బ్రస్సెల్స్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల పౌరులకు స్కెంజెన్ వీసా మినహాయింపు ఇచ్చే అంశంపై జిసిసి -యూరోపియన్ యూనియన్ సీనియర్ అధికారులు చర్చించారు. జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి, యూరోపియన్ ఎక్స్టర్నల్ యాక్షన్ సర్వీస్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్రిక్ మోరా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో చర్చలు జరిపారు. జిసిసి మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో జీసీస, ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..స్కెంజెన్ వీసా నుండి గల్ఫ్ దేశాల పౌరులను మినహాయించే ప్రక్రియతో సహా ద్వైపాక్షిక గల్ఫ్-యూరోపియన్ సంబంధాలకు సంబంధించిన ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు గాజా స్ట్రిప్లోని పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..