గుండె సమస్యలున్న వాళ్లు వేరు శనగలు తినకూడదా.?
- March 20, 2024డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పల్లీలు (వేరు శెనగలు) తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలలో చాలా మంచి పోషకాలున్నాయ్. వాటిని వంటల్లో వాడుకోవడం మంచిదే. అలాగే, డ్రై రోస్ట్ చేసుకుని, లేదంటే ఉడికించుకుని స్నాక్స్లా తినడం కూడా మంచిదే.
ఉడికించిన పల్లీలు తింటే ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అయితే, ఆయిల్, మసాలా మిక్స్ చేసిన పల్లీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
పల్లీల్లో నియాసిన్, విటమిన్ ఇ, థయామిన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా వుంటాయ్.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. పల్లీలను కూడా మితంగానే తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో వుంటుంది. అతి అయితే, అధికమవుతుంది.
ఉడికించిన వేరు శెనగలు తింటే డయాబెటిస్ వున్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో వుంటాయ్.
గుండె సమస్యలున్నవాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు ఉడికించిన పల్లీలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రక్తపోటుని బ్యాలెన్స్డ్గా వుంచడంలో తోడ్పడతాయ్. అందు వల్ల గుండె ఆరోగ్యానికి ఎటువంటి హానీ వుండదు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం