గ్రాండ్ మసీదు ప్రాంగణంలో యాత్రికుడిని రక్షించిన అథారిటీ
- March 21, 2024
మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంగణంలో స్పృహతప్పి పడిపోయిన బంగ్లాదేశ్ ఉమ్రా యాత్రికుడు పల్స్ని పునరుద్ధరించడంలో మక్కాలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్ బృందాలు విజయం సాధించాయి. అంబులెన్స్ బృందాలు ఆదివారం నాడు 50 ఏళ్ల యాత్రికుడు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడని సమాచారం అందడంతోనే రంగంలోకి దిగాయి. పల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు షాక్ పరికరాన్ని ఉపయోగించి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ను అందించారు. కోలుకున్న యాత్రికుడు అవసరమైన చికిత్సను అందించేందుకు వీలుగా హరమ్ అత్యవసర కేంద్రానికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులను 997 నంబర్కు కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







