గ్రాండ్ మసీదు ప్రాంగణంలో యాత్రికుడిని రక్షించిన అథారిటీ
- March 21, 2024
మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంగణంలో స్పృహతప్పి పడిపోయిన బంగ్లాదేశ్ ఉమ్రా యాత్రికుడు పల్స్ని పునరుద్ధరించడంలో మక్కాలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్ బృందాలు విజయం సాధించాయి. అంబులెన్స్ బృందాలు ఆదివారం నాడు 50 ఏళ్ల యాత్రికుడు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడని సమాచారం అందడంతోనే రంగంలోకి దిగాయి. పల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు షాక్ పరికరాన్ని ఉపయోగించి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ను అందించారు. కోలుకున్న యాత్రికుడు అవసరమైన చికిత్సను అందించేందుకు వీలుగా హరమ్ అత్యవసర కేంద్రానికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులను 997 నంబర్కు కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









