అన్ని కంపెనీలు GDRFA ఆన్లైన్ సిస్టమ్ లో నమోదు చేయించుకోవాలి
- June 30, 2015
దుబాయిలో నడపబడుతున్న అన్ని కంపెనీలు, ఉద్యోగుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ఇ-సర్వీసు పద్ధతిని -రెసిడెన్సీ జారీకి, రెన్యువల్ కొరకు, వర్క్ పర్మిట్ మరియు విజిట్-వీసా దరఖాస్తుల మాన్యువల్ దరఖాస్తుకు బదులుగా మాత్రమే వాడాలని అక్కడి జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫేర్స్ (GDRFA) యొక్క డైరక్టర్ జనరల్ - మేజర్ జనరల్ మొహమ్మద్ ఆహ్మైద్ అల్ మర్రి తెలిపారు. GDRFA సేవలను వినియోగించుకోవడానికి ముందుగా అన్ని కంపెనీలు ఆన్లైన్ సిస్టమ్ కొరకు నమోదు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ సేవలలోకి మారటం అనేది వినియోగదారుల కొరకు సేవలను అభివృద్ధి పరచి, సౌకర్యవంతంగా చేయడానికి మరియు పద్ధతులను సరళంగా చేయడానికేనని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల సమయాన్ని, శ్రమను తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







