అన్ని కంపెనీలు GDRFA ఆన్లైన్ సిస్టమ్ లో నమోదు చేయించుకోవాలి
- June 30, 2015
దుబాయిలో నడపబడుతున్న అన్ని కంపెనీలు, ఉద్యోగుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ఇ-సర్వీసు పద్ధతిని -రెసిడెన్సీ జారీకి, రెన్యువల్ కొరకు, వర్క్ పర్మిట్ మరియు విజిట్-వీసా దరఖాస్తుల మాన్యువల్ దరఖాస్తుకు బదులుగా మాత్రమే వాడాలని అక్కడి జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫేర్స్ (GDRFA) యొక్క డైరక్టర్ జనరల్ - మేజర్ జనరల్ మొహమ్మద్ ఆహ్మైద్ అల్ మర్రి తెలిపారు. GDRFA సేవలను వినియోగించుకోవడానికి ముందుగా అన్ని కంపెనీలు ఆన్లైన్ సిస్టమ్ కొరకు నమోదు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ సేవలలోకి మారటం అనేది వినియోగదారుల కొరకు సేవలను అభివృద్ధి పరచి, సౌకర్యవంతంగా చేయడానికి మరియు పద్ధతులను సరళంగా చేయడానికేనని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల సమయాన్ని, శ్రమను తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









