అమెరికా మార్కెట్లోకి అమూల్ పాలు
- March 26, 2024భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్ అమూల్.. అతి త్వరలో అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వారం రోజుల్లో కంపెనీకి చెందిన తాజా పాల ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేయనున్నట్లు అమూల్ బ్రాండ్ నిర్వహణదారైన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎ్ఫ) తెలిపింది. దీని కోసం 108ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించారు. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా డైరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ తాజా పాలను విదేశాల్లో లాంచ్ చేయడం మాత్రం ఇదే తొలిసారని జీసీఎంఎంఎఫ్ ఎండీ జయేన్ మెహతా అన్నారు. యూఎ్సలోని భారతీయులు, మిగతా ఆసియా దేశాల వారి కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ అండ్ ట్రిమ్ పాలప్యాకెట్లను న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర నగరాల్లో విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్ టర్నోవర్ వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.55,000 కోట్లకు చేరుకుంది. ఈ సంస్థ ఇప్పటికే 50 దేశాలకు డైరీ ఉత్పత్తులను ఎగమతి చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్