ఖతార్ లో పర్యటిస్తున్న మోదీ..

- June 05, 2016 , by Maagulf
ఖతార్ లో పర్యటిస్తున్న మోదీ..

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గల్ఫ్ దేశం ఖతార్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దోహాలో ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ప్రధాని.. భారత్ లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవరోధాలను తొలగిస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.భారత్ లో రైల్వేలు, సోలార్ ఎనర్జీ, వ్యవసాయోత్పత్తుల శుద్ధి వంటి రంగాల్లో ఖతార్ పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలున్నాయని మోదీ వెల్లడించారు. భారత్ లోని 600 మిలియన్లకు పైగా ఉన్న యువత దేశానికి ప్రధాన బలమన్నారు. దేశంలో స్మార్ట్ సిటీ, మెట్రోస్ అండ్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com