పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- March 28, 2024జెడ్డా: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని జోర్డాన్ లోయలో 8,000 డనుముల భూమిని ఇజ్రాయెల్ జప్తు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భూమిని జప్తు చేయడం గురించి స్పందించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను, ఇజ్రాయెల్ ఆక్రమణ యొక్క కఠోరమైన పద్ధతులను పొడిగించడమేనని పేర్కొంది. సౌదీ అరేబియా అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలను ఉల్లంఘిస్తాయని తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుందని పేర్కొన్నది. ఇది స్థిరమైన శాంతి అవకాశాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం