ఖతార్‌లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు

- March 28, 2024 , by Maagulf
ఖతార్‌లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు

దోహా: ఖతార్  ఎక్స్ఛేంజ్ హౌస్‌లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి లావాదేవీకి అదనంగా QR5 వ‌సూలు చేయ‌నున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో QR15గా ఉన్న రుసుము ఇప్పుడు ప్రతి లావాదేవీకి QR20కి పెరిగింది. స్థానిక రెమిటెన్స్ హౌస్‌లోని ఒక అధికారి మాట్లాడుతూ.. పెరిగిన రుసుములు భౌతిక శాఖలు, ఆన్‌లైన్ లావాదేవీల‌కు వ‌ర్తింస్తుంద‌ని తెలిపారు. ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని ఆయన తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com