FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- March 29, 2024
హైదరాబాద్: నిర్మాతగా ఇంద్రాణి, సునామి వంటి అనేక చిత్రాలను నిర్మించి సినీ సంబంధిత పలు శాఖలలో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమిస్తూ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష కార్యదర్సులు అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ :- జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబందించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ కృషి చేస్తారని అన్నారు.మధుకర్ మాట్లాడుతూ :- అంతర్ రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాల కై కృషి చేస్తానని అన్నారు.ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసిన తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతిత్వరలో ఏర్పాటు చేయనున్నామని , తద్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకొనే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి అన్నారు.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







