వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్
- April 03, 2024![1 వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్](https://www.maagulf.com/godata/articles/202404/ok_1712135122.jpg)
తిరువనంతపురం: వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ అభ్యర్థిని మార్చుతూ వచ్చిన సీపీఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి ‘అన్నీరాజా’ను బరిలోకి దించింది. బీజేపీ తరపున ఆ పార్టీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..