కేజ్రీవాల్ ఆరోగ్యం పై స్పందించిన జైలు అధికారులు

- April 04, 2024 , by Maagulf
కేజ్రీవాల్ ఆరోగ్యం పై స్పందించిన జైలు అధికారులు

న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తీహార్ జైలు వర్గాలు స్పందించాయి. కేజ్రీవాల్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, ఆయన కీలక ఆరోగ్య వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు.

కేజ్రీవాల్ ను తాజాగా ఇద్దరు వైద్యులు పరిశీలించారని…రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కీలక అవయవాల పనితీరు అంతా బాగుందని వారు తెలిపారని వివరించారు. అంతేకాదు, జైలుకు వచ్చేనాటికి కేజ్రీవాల్ 65 కిలోల బరువు ఉన్నారని, ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్నే అందిస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com