కేజ్రీవాల్ ఆరోగ్యం పై స్పందించిన జైలు అధికారులు
- April 04, 2024
న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తీహార్ జైలు వర్గాలు స్పందించాయి. కేజ్రీవాల్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, ఆయన కీలక ఆరోగ్య వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు.
కేజ్రీవాల్ ను తాజాగా ఇద్దరు వైద్యులు పరిశీలించారని…రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కీలక అవయవాల పనితీరు అంతా బాగుందని వారు తెలిపారని వివరించారు. అంతేకాదు, జైలుకు వచ్చేనాటికి కేజ్రీవాల్ 65 కిలోల బరువు ఉన్నారని, ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్నే అందిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









