బ్లూ కాలర్ కార్మికులకు విమాన టిక్కెట్లు, కార్లు, స్మార్ట్ఫోన్లు, బంగారు నాణేలు.. దుబాయ్
- April 04, 2024
దుబాయ్: ఈద్ అల్ ఫితర్ కోసం దుబాయ్లో బ్లూ కాలర్ వర్క్స్ కోసం బహుమతులను ప్రకటించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) ఫెస్టివల్లో భాగంగా విమాన టిక్కెట్లు, మూడు కొత్త సెడాన్ కార్లు, 150 స్మార్ట్ఫోన్లు, 300 బంగారు నాణేలు మరియు డిస్కౌంట్ కార్డ్లు అందించనున్నారు. దుబాయ్లోని కార్మికుల కోసం ఈ వేడుకలు ఏప్రిల్ 7 నుండి 12 వరకు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. 'మేము కలిసి ఈద్ జరుపుకుంటాము' అనే నినాదంతో జెబెల్ అలీ, అల్ కూజ్ మరియు ముహైస్నా ప్రదేశాలలో ఉత్సవాలు జరుగుతాయి.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.ఈ వేడుకలు ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అదా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మరియు నూతన సంవత్సరానికి అనుగుణంగా ఉంటాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రీ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..







