బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ మృతికి ఘన నివాళులు..
- June 05, 2016
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో పాటు ప్రముఖ వ్యక్తులు బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 74 ఏళ్ల ఈ గ్రేటెస్ట్ బాక్సర్ శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అరిజోనా నుంచి కుటుంబసభ్యులు అలీ పార్థివ దేహాన్ని ఆదివారం లూయిస్విల్లేలోని స్వగృహానికి తరలించారు. వాస్తవానికి తాను చనిపోవడానికి కొన్నేళ్ల ముందే అంతిమయాత్ర ఎలా సాగాలో అలీ తన కుటుంబసభ్యులకు వివరించారట. ఆయన కోరిన విధంగానే ఈ కార్యక్రమాన్ని సాగించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు ఆయన మృతికి సంతాపకంగా నగరంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆయన చిన్నతనంలో నివసించిన గృహం మొహమ్మద్ అలీ సెంటర్ ముందు అభిమానులు పుష్పగుచ్ఛాలను ఉంచి తమ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈనెల 10న (శుక్రవారం) ఆయన అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ అధికార ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు. అంతకుముందు గురువారం కుటుంబసభ్యుల సమక్షంలో ప్రార్థనలు జరుగుతాయి. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇమాం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలీ అంత్యక్రియల ప్రసారాన్ని విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే అవకాశం ఉంది. మరో 30 నిమిషాలు...: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ చివరి క్షణాల గురించి అతని కూతురు హనా అలీ ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. అలీ శరీరంలో అన్ని భాగాలు పని చేయడం ఆగిపోయిన తర్వాత కూడా ఆయన గుండె మరో 30 నిమిషాలు కొట్టుకుందని ఆమె చెప్పింది. 'నాన్న చనిపోయే సమయంలో మేమంతా అక్కడే ఉన్నాం. వి లవ్ యూ అని చెప్పాం. ఆయన శరీరంలో అప్పటికే అన్ని అవయవాలు విఫలమైపోయాయి. అయితే హృదయం మాత్రం ఆగిపోలేదు. మరో 30 నిమిషాలు కొట్టుకుంటూనే ఉంది. ఇలాంటిది బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు' అని హనా పేర్కొంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







