లోక్సభ ఎన్నికలు 2024
- April 08, 2024
ఏప్రిల్, మే నెలలు భారతదేశంలో ఎన్నికల నెలలు. 2024 లోక్సభ ఎన్నికలు ఈ రెండు నెలల్లో ఏడు విడతల్లో జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.ప్రస్తుత 17వ లోక్సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16 లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆ ఎన్నికల్లో దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 303 సీట్లను కైవసం చేసుకొని దేశ అధికార పగ్గాలు చేపట్టింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.
మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా, అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఇప్పటికే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది.ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయని ఎన్నికలు జరుగుతాయి.
జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 30కి పైగా పార్టీలు చేరగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. అత్యధికంగా యూపీలో 80 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.మోదీ చరిష్మా మీదే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆధారపడిన బీజేపీ , ఈసారి కూడా మోదీనే నమ్ముకొని ఎన్నికల గోదాలోకి దిగుతుంది. అయితే బీజేపీని మూడోసారి అధికారంలోకి రానియకుండా నిలువరించేందుకు విపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
--డి.వి.అరవింద్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







