1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- April 09, 2024 , by Maagulf
1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష

బహ్రెయిన్: హిస్ మెజెస్టి సింహాసనాన్ని అధిష్టించిన సిల్వర్ జూబ్లీని గుర్తు చేస్తూ.. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా బహ్రెయిన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. దోషులుగా తేలిన 1,584 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్, హెచ్‌ఎం రాజు రాయల్ డిక్రీని జారీ చేయడాన్ని ప్రశంసించింది.  బహ్రెయిన్ లో సామాజిక నిర్మాణాన్ని పరిరక్షిస్తూ, ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ, వ్యక్తిగత మరియు పౌర హక్కులను కాపాడుతుందని అభినందించింది.  క్షమాభిక్ష పొందిన వ్యక్తులకు శిక్షణా కార్యక్రమాలను అందించాలని,  ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచాలని కార్మిక మంత్రిత్వ శాఖను HRH ప్రిన్స్ సల్మాన్ ఆదేశించారు. ఈద్ ను పురస్కరించుకొని హెచ్‌ఎం కింగ్ హమద్.. బహ్రెయిన్ ప్రజలకు మరియు అన్ని అరబ్,  ఇస్లామిక్ దేశాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com