1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 09, 2024బహ్రెయిన్: హిస్ మెజెస్టి సింహాసనాన్ని అధిష్టించిన సిల్వర్ జూబ్లీని గుర్తు చేస్తూ.. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా బహ్రెయిన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. దోషులుగా తేలిన 1,584 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్, హెచ్ఎం రాజు రాయల్ డిక్రీని జారీ చేయడాన్ని ప్రశంసించింది. బహ్రెయిన్ లో సామాజిక నిర్మాణాన్ని పరిరక్షిస్తూ, ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ, వ్యక్తిగత మరియు పౌర హక్కులను కాపాడుతుందని అభినందించింది. క్షమాభిక్ష పొందిన వ్యక్తులకు శిక్షణా కార్యక్రమాలను అందించాలని, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచాలని కార్మిక మంత్రిత్వ శాఖను HRH ప్రిన్స్ సల్మాన్ ఆదేశించారు. ఈద్ ను పురస్కరించుకొని హెచ్ఎం కింగ్ హమద్.. బహ్రెయిన్ ప్రజలకు మరియు అన్ని అరబ్, ఇస్లామిక్ దేశాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!