దశల వారీగా ఉద్యోగులను అమరావతికి తరలిస్తా0
- June 06, 2016
తాత్కాలిక సచివాలయ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. జూన్ 27లోగా సచివాలయ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయిన కార్యాలయాల్లోకి ఏయే విభాగాలు తరలించాలో నిర్ణయించి... వారికి ముందస్తు సమాచారం ఇస్తామన్నారు. అనంతరం మిగిలిన విభాగాలకు చెందిన ఉద్యోగులను దశల వారీగా అమరావతికి తరలిస్తామన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయానికి వచ్చే ఉద్యోగులకు వసతి సౌకర్యం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలి సచివాలయ నిర్మాణ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. గోడల నిర్మాణాలు, విద్యుత్, ఇతర సౌకర్యాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. వెలగపూడికి వచ్చే రహదారుల అభివృద్ధి పనులపైనా చర్చించారు.రాజధాని ప్రాంతంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. హైదరాబాద్ను 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినప్పటికీ... రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే తాను ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. వేరే రాష్ట్రం నుంచి పరిపాలన సాగిస్తే ప్రజలకు తృప్తిగా ఉండదని... స్థానికంగా పాలన సాగితే ప్రజలకు న్యాయం చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్నందునే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







