దాసరి నారాయణరావు పేరిట ‘దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్’
- April 11, 2024
హైదరాబాద్: 150కి పైగా సినిమాలు తీసి దర్శకరత్నగా నిలిచారు దాసరి నారాయణరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు గాను దాసరి నారాయణరావు జయంతి మే 4న డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. తాజాగా పలువురు సినీ ప్రముఖులు ఆయన పేరుపై ఆయన జయంతి వేడుకలు జరిపించి దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ పేరిట సినిమాలోని పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందించాలని నిశ్చయించారు.
డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయనతో అనుబంధం కలిగిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సి.కళ్యాణ్, సూర్యనారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీలు కమీటీగా ఈ వేడుకని నిర్వహించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మే 5న ఈ వేడుక నిర్వహించనున్నట్టు నేడు ప్రెస్ మీట్ ద్వారా తెలియచేసారు.
దాసరి జ్ఞాపకార్థం అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న.. ఇలా పలు అవార్డుని ప్రదానం చేయనున్నట్టు తమ్మారెడ్డి తెలిపారు. దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు, కరోన వల్ల కంటిన్యూ చేయలేకపోయమని, ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం అని ప్రెస్ మీట్ లో సూర్యనారాయణ తెలిపారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… దురదృష్టవశాత్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి, పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమయంలో మహానుభావుడైన దాసరి నారాయణ పేరిట అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయం అని అన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









