రామ్ చరణ్కు అరుదైన గౌరవం..డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ..
- April 11, 2024చెన్నై: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. RRR తో వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రఖ్యాత కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకున్నారు చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్టు సమాచారం.
ఆ రోజున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకుంటారని సమాచారం. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!