ఇక ఆ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాల్సిందే.!

- April 13, 2024 , by Maagulf
ఇక ఆ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాల్సిందే.!

‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం. ఆ సినిమాకి చాలా సార్లు సీక్వెల్ రూపొందించాలని అనుకున్నారు నిర్మాత అశ్వనీ దత్. కానీ కుదరలేదు.

సెకండ్ జనరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ వచ్చాకా కూడా ఈ ప్రాజెక్ట్‌పై కసరత్తులు జరిగాయ్ కానీ, అదీ కుదరలేదు.

ఇక, ఇప్పుడు.. ఆ సమయం రానే వచ్చిందనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ అయితే సెట్టయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జత కడుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌లోనే ఈ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ నోటి వెంట ఈ ప్రాజెక్ట్ చర్చకొచ్చింది. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయట పెట్టారు.

రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చూడాలన్నది తన డ్రీమ్ అని ఆయన అన్నారు. ఇంకేముంది.! అందరికీ ఆ కోరిక వుంది. సో, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సీక్వెల్‌కి స్ర్కిప్ట్ సిద్దం చేయడమే తరువాయి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com