ఇక ఆ ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టాల్సిందే.!
- April 13, 2024‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం. ఆ సినిమాకి చాలా సార్లు సీక్వెల్ రూపొందించాలని అనుకున్నారు నిర్మాత అశ్వనీ దత్. కానీ కుదరలేదు.
సెకండ్ జనరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ వచ్చాకా కూడా ఈ ప్రాజెక్ట్పై కసరత్తులు జరిగాయ్ కానీ, అదీ కుదరలేదు.
ఇక, ఇప్పుడు.. ఆ సమయం రానే వచ్చిందనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ అయితే సెట్టయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జత కడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ నోటి వెంట ఈ ప్రాజెక్ట్ చర్చకొచ్చింది. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయట పెట్టారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చూడాలన్నది తన డ్రీమ్ అని ఆయన అన్నారు. ఇంకేముంది.! అందరికీ ఆ కోరిక వుంది. సో, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సీక్వెల్కి స్ర్కిప్ట్ సిద్దం చేయడమే తరువాయి.!
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన