పసిడి ధర తగ్గింది

- June 06, 2016 , by Maagulf
పసిడి ధర తగ్గింది

డిమాండు లేమితో సోమవారం . రూ.185 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,040కి చేరింది. నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.18శాతం తగ్గి 1,241.20 యూఎస్‌ డాలర్లకు చేరింది.
వెండి ధర మాత్రం స్థిరంగా రూ.39,200వద్దే ఉంది. కొనుగోళ్లు పెద్దగా లేకపోవడంతో దీని ధర యథాతథంగా ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 16.38గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com