మెంతులు కేవలం వాళ్లకే కాదు.! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్.!
- April 15, 2024రుచికి చేదుగా అనిపించే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్ల పాలిట మెంతులు ఓ వరమనే చెప్పాలి.
నానబెట్టిన మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో వుంటాయ్. అంతేనా.! కేవలం డయాబెటిస్ పేషెంట్లకు మాత్రమే కాదండోయ్.
మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే ఎటువంటి వారికైనా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీరోజూ ఓ గుప్పెడు మెంతులు నానబెట్టిన వాటర్ని పరగడుపునే తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ.
అందుకే మల బద్దకం, అజీర్తి సమస్యలున్న వారు ప్రతీరోజూ క్రమం తప్పకుండా మెంతుల వాటర్ తాగితే ఆ సమస్యలకు ఇట్టే పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఫుష్కలంగా వుంటాయ్. అందుకే వీటిని ప్రతీరోజూ డైట్లో భాగం చేసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ల బాధ నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయ్.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం