తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- April 16, 2024టొరంటో: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక వేడుకలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో దాదాపు 1500 కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
గుప్తేశ్వరి వాసుపిల్లి,సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల మరియు విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేయగా గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఉగాది 2024 సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి నరసింహ చారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల వ్యవహరించారు.ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు.
ప్రాంతీయ చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురుం ప్రేక్షకులను మనోరింజింపజేసింది. అలాగే మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు.
తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక “TCA ఉగాది సంచిక” తృతీయ సంచికను విడుదల చేశారు. దీనిని NCPL అదినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావితరాలకు అందజేయటం అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల గారు, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ , డైరెక్టర్లు -నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి , ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు-మాధురి చాతరాజు గారు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు-దేవేందర్ రెడ్డి గుజ్జుల,కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రాహుల్, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి , విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2024 వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిశాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు